గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు, పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య”
” న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా ”
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.
ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.
ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.
ఇరవైనాలుగు అక్షరములు – దేవతలు
1. తత్ – గణేశ్వరుడు 2. స – నృసింహ భగవానుడు 3. వి – విష్ణుదేవుడు 4. తుః – శివదేవుడు 5. వ – కృష్ణ భగవానుడు 6. దే – రాథా దేవి 7. ణ్యం – లక్ష్మీదేవి 8. భ – అగ్నిదేవుడు 9. ర్గః – ఇంద్రదేవుడు 10. దే – సరస్వతి 11. వ – దుర్గాదేవి 12. స్య – హనుమంతుడు 13. ధీ – పృధ్వీదేవి 14. మ – సూర్యదేవుడు 15. హి – శ్రీరాముడు 16. ధి – సీతామాత 17. యో – చంద్రదేవుడు 18. యో – యమదేవుడు 19. నః – బ్రహ్మదేవుడు 20. ప్ర – వరుణదేవుడు 21. చో – నారాయణుడు 22. ద – హయగ్రీవ భగవానుడు 23. యా – హంసదేవత 24. త్ – తులసీదేవి ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.
బ్రహ్మ పదమును పొందదలచినవారు “కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)
ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం “త్రిసంథ్యా”యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.
ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ భావం ‘మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము’ అని అర్థం
ఇదే గాయత్రీ మంత్రం, ఈ గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞులు భావిస్తారు. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదములో చెప్పబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు మరియు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్దతిలో జపించడం చేసేవారు. కాని మారుతున్న కాలంతో పాటు అందరికి అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు మరియు అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుంది అని పెద్దలు నమ్ముతారు.
దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువులు ప్రయత్నాలు కూడా చేసారు. ఎలాగైతే ఒక బ్రిడ్జ్ మీద సైనికులంతా నిల్చుని క్రమపద్ధతిలో మార్చ్ ఫాస్ట్ చేస్తే వెలువడే ధ్వని తరంగాల ద్వారా ఆ బ్రిడ్జిని కూల్చేయవచ్చో. అదే పద్దతిలో ఈ గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపిస్తే మన శరీరం మనకు తెలీకుండానే ఎన్నో వైబ్రేషన్స్ కి గురవుతుంది అంతే కాకుండా మన మెదడులో కూడా ఒక రకమైన ఆనందంతో, పాజిటివ్ థాట్స్, కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయట. దీని పై పలు విదేశీ విశ్వ విద్యాలయాలు రకరకాల పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
గాయత్రీ మంత్రం గురించి వేదాల ప్రకారం పండితుల వివరణతో చెప్పాలంటే, ‘సవిత’ గాయత్రీ మంత్రమునకు అధిష్టాన దేవత. అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛందము. ప్రణవ రూపమైన ఓం కారమునకు నేను వందనం చేస్తున్నాను. విశ్వాన్ని ప్రకాశింప చేస్తున్న సూర్య తేజమైన సవితాను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రీకి ఉన్న వివిధ అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది. అయితే ఈ వాదనలతో ఏకీభవించని వారు కూడా చాలా మంది ఉన్నారు. ( సేకరించినది )
!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!
🌺🙏🙏🙏🙏🙏🌺